calender_icon.png 1 February, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు జిల్లా విద్యార్థులు

01-02-2025 07:46:08 PM

మంచిర్యాల (విజయక్రాంతి): నస్పూర్ లోని కేజిఏ డిఫెన్స్ అకాడమీ మైధానంలో జనవరి 27న జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి రగ్బీ పోటీలలో మంచిర్యాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ కరస్పాండెంట్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ నెల 2, 3 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రణయ్, రెహన్, యశ్వంత్, హిమాప్రియ, సుహానా, తేజశ్వినిలు పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు కొట్టె దేవేందర్, కార్తీక్, ఉపాధ్యాయులు అభినందించారు.