calender_icon.png 22 October, 2024 | 5:36 PM

ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ

22-10-2024 03:50:14 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మైదానంలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డి. జానకి ప్రారంభించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసు కవాతు మైదానం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖ నిర్వహణ, సిబ్బంది విధులు, ఉపయోగించే ఆయుధాలు, వాహనాలు, ఇతర సాంకేతిక పరికరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవలను ప్రజలకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసు శాఖపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాలు ప్రజలు, ముఖ్యంగా యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు, పోలీసు శాఖపై అవగాహనను పెంచేందుకు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.