06-02-2025 07:26:30 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గల శక్తి సదన్ కేంద్రంను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి గురువారం సందర్శించారు. ఆపదలో ఉన్న మహిళలకు ఆశ్రయం, ఆహారం, దుస్తులు, వైద్యం, సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని న్యాయమూర్తి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మహిళలు, బాలికలకు న్యాయ సహాయం, మార్గదర్శకత్వం కల్పించి వారికి పూర్తి భరోసా కల్పించాలని న్యాయమూర్తి సూచించారు. ఈ సందర్భంగ న్యాయమూర్తి నిరాధారణకు గురి అయిన బాలికల సమస్యలను తెలుసుకొని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అనంతరం వన్ స్టాప్ సఖి సెంటర్, చమన్ బస్తి కొత్తగూడెంలో ఉన్న జ్యోతి అనాధాశ్రమంను సందర్శించి అక్కడ వృద్ధులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. కొంత నిత్యవసర సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, న్యాయవాది మెండు రాజమల్లు, శక్తి సదన్ నిర్వాహకులు, పారాలీగల్ వాలంటీర్ బి. రాజమణి తదితరులు పాల్గొన్నారు.