calender_icon.png 19 March, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమె మాటే-తుపాకి తుటా...

19-03-2025 05:17:45 PM

డి సీతాలక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు...

ఐద్వా ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సభ సభలో జిల్లా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి..

భద్రాచలం (విజయక్రాంతి): ఆమె ఉపన్యాసాలతో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి దొరల గుండెల్లో తూటాలను పేల్చిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి అన్నారు. బుధవారం భద్రాచలం చంద్ర భవనంలో ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోదురాలు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సభలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు నాదెళ్ల లీలావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్వరాజ్యం చిత్రపటానికి నాదెళ్ల లిలావతి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీతాలక్ష్మి మాట్లాడుతూ.... మల్లు స్వరాజ్యం సంపన్న కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే 13 ఏళ్లకే తుపాకి పట్టి నిజం ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేశారని అన్నారు. తుపాకి పట్టి గెరిల్లా పోరాట నిర్మించిన మల్లు స్వరాజ్యంనీ నిజాం సైన్యాలు యెదుర్కోలేక ఇంటిని సైతం తగలబెట్టారని అన్నారు. స్వరాజ్యం రజాకర్ల పాలిట సింహా స్వప్నం అయ్యి నిలిచారని కొనియాడారు. ఆమె జానపద బాణీల్లో కవి కట్టి స్వయంగా ఆమె పాడి గ్రామంలోని ప్రజలను ఐక్యం చేసేదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పోటీచేసి 2 పర్యాయాలు సీపీఎం పార్టీ తరపున ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. మల్లు స్వరాజ్యం స్పూర్తితో మహిళలందరూ ఐద్వా ఇచ్చే పిలుపులో, పోరాటలలో భాగస్వాములు అయినప్పుడే నిజమైన ఘననివాలి అర్పించినట్టు అని సీతలక్ష్మి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు జీవన జ్యోతి, వై పూర్ణిమా దేవి, గౌతమి యే జే, ఆఫీస్ భేరర్స్ సక్కుభాయి, జీ నాగలక్ష్మి, ఎమ్ సుబ్బలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు కే సుసిల, గణపతమ్మ,సి యెచ్ దనమ్మ,డి నాగలక్ష్మి, సౌదామిని, సౌభాగ్యం తడితరులు పాల్గొన్నారు.