17-03-2025 03:43:37 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఆదివారం మంచిర్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ ఈ మారయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లెటిక్స్ 100 మీటర్స్, 400 మీటర్స్, జావలిన్ త్రో జిల్లా స్థాయి క్రీడా పోటీలలో బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ క్రీడాకారులు పథకాలు సాధించారని పాఠశాల డైరెక్టర్ ఈ.రవి ప్రసాద్, ప్రిన్సిపల్ యం.రాజా రమేష్ లు తెలిపారు.
ఇందులో భాగంగా అండర్-14 బాలికల విభాగంలో నామని సహస్య జావలిన్ త్రోలో గోల్డ్ మెడల్ ను, అండర్ 14 బాలుర విభాగంలో పి. జేస్పాల్ జావలిన్ త్రోలో సిల్వర్ మెడల్ ను, వి.సిద్దేశ్వర్ 400 మీటర్స్ లో బ్రాంజ్ మెడల్ ను, అండర్ 16 బాలికల విభాగంలో ఎం.సింధూజ 100 మీటర్స్, జావలిన్ త్రో లో గోల్డ్ మెడల్ ను, ఒడ్నల రుచిత 400 మీటర్స్ లో గోల్డ్ మెడల్ ను సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సల్పాల సంతోష్ యాదవ్, ఒడ్నాల మల్లేష్ యాదవ్, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.