calender_icon.png 16 October, 2024 | 4:11 PM

రోడ్డు ప్రమాదంలో జిల్లా నాయకుడి కుమారుడు మృతి

16-10-2024 12:50:08 PM

గద్వాల‌ (విజయక్రాంతి): గద్వాల మండల పరిధిలోని దయ్యాల వాగు సమీపంలోని గద్వాల కర్నూల్ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు కల్వర్టును ఢీకొట్టడంతో కారులో ఉన్న యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి...కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి కుమారుడు పటేల్‌ రామచంద్రారెడ్డి (28) బుధవారం తెల్లవారుజామున ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాలకు‌ కారులో వస్తున్న క్రమంలో కారు‌ అదుపుతప్పి బ్రిడ్జి వాల్ ను బలంగా ఢీకొనడంతో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న రామచంద్రారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా మార్గమద్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా‌ నాయకులు గద్వాల ఆసుపత్రిలో మృతదేహాని సందర్శించి నివాళ్లులర్పించారు. జిల్లా నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాడసానుభూతి తెలియజేశారు.