calender_icon.png 27 February, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

27-02-2025 01:26:40 AM

మెదక్, ఫిబ్రవరి 26(విజయ క్రాంతి): ఈనెల 27న జరుగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి  రాహుల్ రాజ్  తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై ఈ ప్రక్రియలో పాల్గొనే పోలింగ్ నిర్వహించే అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణలో ఓటర్లు  స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఓటు హక్కు వినియోగానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు తూఫ్రాన్ జయచంద్రారెడ్డి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, డిఇఓ రాధా కిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి  పాల్గొన్నారు.