15-03-2025 08:03:13 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రోగ్రాం ను అదిలాబాద్ లోని తాటిగూడ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం వారు చదువులో ముందుండటానికి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపటుతున్నదని అందులో భాగంగానే మొదట 6 జిల్లాల్లో AI ఆధారిత ఆన్లైన్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రారంభించిందన్నారు. డీఈఓ ప్రణీత, తదితరులు పాల్గొన్నారు.