calender_icon.png 23 October, 2024 | 7:06 AM

బాలల సంరక్షణ కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి...

29-08-2024 01:12:03 PM

మిషన్ వాత్సల్య పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయ క్రాంతి): మన జిల్లాలో బాలల సంరక్షణ కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మిషన్ వాత్సల్య కార్యక్రమ అమలు పై జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి సంబంధిత మహిళా శిశు దివ్యంగా సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ..  జిల్లాలోని వివిధ సిసిఐ లలో 6వ తరగతి చదువుతున్న పిల్లలందరినీ ఎంపిక చేసి రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. 

జిల్లాలో ఉన్న అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లలో స్పాన్సర్షిప్ కు అర్హులైన పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ బాల్య వివాహాలు జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలని, జిల్లాలో ఎక్కడ చట్ట వ్యతిరేక దత్తతలు జరగకుండా సంబంధిత ప్రకృతి ఆసుపత్రి సూపరింటెండెంట్ లతో సమన్వయం చేసుకోవాలని, గ్రామీణ బాలల పరిరక్షణ కమిటీలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, బాలల పై జరిగే లైంగిక దాడులను నివారించేందుకు సంబంధిత వ్యవస్థలతో సమయం చేసుకుని పని చేయాలన్నారు. ఈ సమావేశంలో  జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కమలాకర్, మిషన్ వాత్సల్య స్కీమ్ సిబ్బంది , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.