- 7 నాటికి అన్ని జిల్లాల్లో పూర్తి
- ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాం తి): నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొద టి విడతలో భాగంగా కరీంనగర్, వరంగల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గురువారం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయనున్నట్టు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా తో మాట్లాడారు.
కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ వద్ద మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ చేప పిల్లలను జలాశయంలో వదలనున్నట్టు వివరించారు. మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 7 నాటికి అన్ని జిల్లాల్లో చేప పిల్లలను పంపిణీ చేస్తామని స్పష్టంచేశారు.