09-04-2025 12:43:09 AM
పెబ్బేరు ఎప్రిల్ 8:మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం జోరుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలకు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం ప్రారంభించి పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పక్షపాతిగా ఉంటుందని కాంగ్రెసు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రేషన్ షాపు డీలర్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.