26-03-2025 12:15:14 AM
ఆందోల్, మార్చి 25 :ఆందోల్ మండలంలో 153 కళ్యాణ లక్ష్మి, 19 షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. మంగళవారం నాడు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వేదిక పై అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమి టీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి,ఆర్డిఓ పాండు, తహసిల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తాసిల్దార్ సాగర్ మధుకర్ రెడ్డి, అక్సాన్పల్లి సొసైటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ హరికృష్ణ, ప్రదీప్ గౌడ్, మాజీ సర్పంచులు శివశంకర్ గౌడ్, అశోక్, కాంగ్రె స్ పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.