ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో రాత్రిపూట చీకటిగా ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామచంద్ర రావు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచపూర్ గ్రామానికి చెందిన అమ్మ ఫౌండేషన్ సభ్యుల దృష్టికి పాఠశాల ఆవరణలో లైట్ ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోరడంతో అమ్మ ఫౌండేషన్ సభ్యులు స్పందించారు. పాఠశాల ఆవరణలో రాత్రిపూట చీకటిగా ఉంటుందని తెలుపడంతో ఫౌండేషన్ సభ్యులు లైటులను పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయించారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్రావు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు అమ్మ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల విద్యార్థుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన లైట్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.