09-04-2025 01:05:31 AM
కల్లూరు, ఏప్రిల్ 8 :-పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కల్లూరు పట్టణం, కల్లూరు మండలానికి చెందిన 115 మంది లబ్ధిదారులకు రూ.29,96,500 రూపాయలు విలువైన సి.యం.ఆర్ ఆఫ్ చెక్కులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయా నంద్ మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు.ముఖ్య మంత్రిరేవంత్ రెడ్డి కి, రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క కి, తుమ్మల నాగేశ్వరావు కి,పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి కి ధన్యవాదములు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు.
అనంతరం కల్లూరు మార్కెట్ యార్డులో విశాల సాహకార పరపతి సంగం లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో దాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంబించారు.ఈ కార్యక్రమం లో తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్,ఎస్త్స్ర డి.హరిత, కల్లూరు పిఎసిఎస్ సీఈవో బీరవెల్లి శ్రీనివాస రావు, మార్కెట్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు, బాగం ప్రభాకర్ చౌదరి,
ఆళ్లకుంట నరసింహారావు,పాపబత్తిని నగేష్,యాసా శ్రీకాంత్, మట్టా రామకృష్ణ,లక్కినేని కృష్ణ, కీసర శ్రీనివాస్ రెడ్డి,జోనబోయిన గోపాల్ రావు, బొల్లం ఉపేంద్ర,తోట సుబ్బారావు కల్లూరు పట్టణం,కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు,మహిళా, యూత్ నాయకులు పాల్గొన్నారు.