30-03-2025 12:00:00 AM
చేవెళ్ల , మార్చి 29 : శంకర్పల్లి మండల పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కాలె యాదయ్య శని వారం శంకర్పల్లి ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు.
అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను బాధితుల కుఅందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్యగౌడ్, తహసీల్దార్ సురేందర్, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.