04-04-2025 09:48:31 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తి, 19 వ వార్డులో శుక్రవారం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు ప్రారంభించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేష్, కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ ఆసిఫ్, అల్లం కిషన్ , అబ్దుల్ జాబి తదితరులు పాల్గొన్నారు.