24-02-2025 06:36:15 PM
నిర్మల్ (విజయక్రాంతి): సోన్ మండల కేంద్రంలో టీజీ ఆర్టీసీ ద్వారా దివ్యాంగులకు మంజూరైన ఆర్టీసీ రాయితీ పాసులను సోమవారం ఆర్టీసి ఇన్చార్జ్ రమేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మొత్తం 20 మందికి పాసులను అందించడం జరిగిందని అధికారులు తెలిపారు. దివ్యాంగులకు ఆర్టీసి అందిస్తున్న సేవలను సద్వినియోగించుకోవాలని వారు కోరారు.