27-03-2025 12:00:00 AM
కూసుమంచి , మార్చి 26 : వివిధ అనారోగ్య సమస్యలకి చికిత్స పొంది సీఎంఆ ర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యా యి.. ఈ సిఎన్ఆర్ఎఫ్ చెక్కులను బుదవారం నేలకొండపల్లి మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత సహాయకులు తంబూరి దయాకర్ రెడ్డి లబ్ధిదారు లకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద కుటుంబాలకు ఒక భరోసా అన్నారు.. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు ,శాఖమూరి రమేష్ ,నెల్లూరి భద్రయ్య ,మామిడి వెంకన్న, బొడ్డు బొంద య్య, బచ్చలకూరి నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు..