calender_icon.png 24 October, 2024 | 2:03 PM

ఏంఎల్ఏ జారే చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

24-10-2024 11:11:59 AM

అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజక  కేంద్రమైన అశ్వారావుపేట మండలం లో స్థానిక శాసన సభ్యులు జారే ఆదినారాయణ కల్యాణి లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మండలం లోని మొద్దులగూడెం, నారం వారిగూడెం, నారంవారిగూడెం కాలని, కేశప్పగూడెం, బిల్లేడుగూడెం, అశ్వారావుపేట, దొంతికుంట, వినాయకపురం, ఆసుపాక, వడ్డే రంగాపురం, గాండ్ల గూడెం, నారాయపురం, దిబ్బగూడెం, మామిళ్ళ వారిగుడెం, తిరుమల కుంట గ్రామాల్లో లబ్ధి దారుల ఇళ్ల కు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమం లో కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మా రాంబాబు, తదితరులు ఉన్నారు.