26-04-2025 09:38:49 PM
మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి పట్టణానికి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ పంపిణీ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు మంజూరైన చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు వరమని అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.