calender_icon.png 23 October, 2024 | 12:57 PM

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

23-10-2024 11:08:47 AM

కూకట్‌పల్లి: అనారోగ్యాల బారిన పడిన బాధిత పేద ప్రజల చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చేయూతనిస్తుందని కూకట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన సుమారు 27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 9,68,500 రూపాయల చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనారోగ్యాల బారిన పడిన ప్రతి ఒక్కరు సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోవలని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ను లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు.