16-04-2025 12:00:00 AM
కడ్తాల్, ఏప్రిల్ 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం విడుతలవారీగా నిధులు విడుదల కు శ్రీకారం చుట్టింది. మం గళవారం శంషాబాద్ లో నోవాటెల్ హోట ల్ లో సీఎల్పీ సమావేశం అనంతరం కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం కొం డ్రిగానిబోడుతండా కు చెందిన లబ్ధిదారులకు మొదటి విడుత కింద స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. లక్ష రూపాయల చెక్కులను అందజేశారు.
అర్హులంద రికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతాయని వారు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చెక్కులను అం దజేయడంతో లబ్ధిదారులు సీఎం, మంత్రి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.