హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): నగరంలోని అమరావతి ఎల్హెచ్ఓ ప్రాంగణంలో గణేశ్ నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాహుల్ సాంకృత్య ఆధ్వర్యంలో లడ్డూలను పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో అమరావతి సర్కిల్లోని ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం సందర్భంగా గత 36 ఏళ్లుగా ఎస్బీఐ ఆధ్వర్యంలో లడ్డూలు, తాగునీటి పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.