calender_icon.png 29 September, 2024 | 6:57 PM

జియో సేవల్లో అంతరాయం

18-09-2024 12:00:00 AM

సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఫిర్యాదులు

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ జియో సేవల్లో అంతరాయం ఏర్పడింది. జియో మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్ సేవలకూ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ వినియోగదారులు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా ముంబయి వాసులు ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం జియో సేవల్లో అంతరాయంపై 10వేల మందికిపైగా యూజర్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

నో నెట్‌వర్క్, మొబైల్ ఇంటర్నెట్, జియో ఫైబర్ సేవల గురించి ప్రధానంగా ఫిర్యాదులు అందాయి. కాగా జియో సేవల్లో అంతరాయంపై ఆ కంపెనీ స్పందించింది. చిన్నపాటి సాంకేతిక లోపాల కారణంగా ముంబయి వాసులు సేవల్లో అంతరాయం ఎదుర్కొన్నట్లు తెలిపింది. సమస్యలు పరిష్కరించామని, సేవలు యథాతథంగా అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. సబ్‌స్ర్కైబర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని విచారం వ్యక్తంచేసింది.