పినపాక,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని గుండాల మండల కేంద్రంలో జ్వరం వచ్చిన తర్వాత తీవ్రమైన కీళ్ళ, ఒళ్ళు నొప్పులు భరించలేని బాధితులకు మానాల బ్రదర్స్ ఆధ్వర్యంలో మొదటి విడత శుక్రవారం ఎనిమిది వందల మందికి యునానీ ఆయుర్వేదిక్ మందులు పంపిణీ చేసిన విషయం విధితమే. ఈ మందుల పంపిణీకి విశేష ఆదరణ లభించడంతో ప్రజల విజ్ఞప్తి మేరకు సోమవారం రెండవ విడతలో మరో ఎనిమిది వందల మందికి ఆయుర్వేదిక్ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గుండాల ఎస్సై రాజమౌళి, ప్రభుత్వ వైద్యాధికారి మనీష్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణ, ప్రజల విజ్ఞప్తి మేరకు మరో ఎనిమిది వందల మందికి ఈ మందులను పంపిణీ చేయడం జరిగిందని, ఈ యునానీ ఆయుర్వేదిక్ మందులు వాడిన తర్వాత ప్రజలు మరికొంతమందికి పంపిణీ చేయాలని కోరడంతో మరలా అందించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానాల బ్రదర్స్ మానాల నారాయణమూర్తి, మానాల వీరన్న, మానాల ప్రభాకర్, మానాల శ్రావణ్, మానాల ప్రణీత్, మానాల సతీష్, ఆర్యవైశ్య వాసవి క్లబ్ సభ్యులు గౌరిశెట్టి సత్యనారాయణ, తవిడిశెట్టి నాగరాజు, తవిడిశెట్టి రాంబాబు, అయితా శ్రీశైలం, అయితా పూజీత్, అయితా నాగమల్లయ్య, తాటిపల్లి సత్యం, మానాల ఉపేందర్, గోలి కిరణ్, గుండాల ప్రెస్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు బత్తిని సాయన్న, గడ్డం లాలయ్య, తదితరులు పాల్గొన్నారు.