calender_icon.png 21 April, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్ప2పై కేసు డిస్మిస్ చేయండి

11-12-2024 12:58:21 AM

* హైకోర్టులో సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ పిటిషన్  

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తొక్కిసలాట వల్ల ఒక మహిళ మృతి చెందిన ఘటనపై నమోదైన కేసును కొట్టివేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యం, ఎం రేణుకాదేవి మరో అయిదుగురు పార్టనర్స్ పిటిషన్ దాఖలు చేశారు.

హీరో అల్లు అర్జున్ రాక కారణంగా జరిగిన తొక్కిసలాటలో తన భార్య రేవతి మృతి చెందిందని, కుమారుడు, కుమార్తెలు గాయపడ్డారంటూ ఎం భాస్కర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చిక్కడపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ్ర‘పీమియర్ షోను థియేటర్ ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వ అనుమతితో మైత్రి డిస్ట్రిబ్యూటర్ ఏర్పాటు చేసింది. బుకింగ్ ఒప్పందంలో భాగంగా 4, 5 తేదీల్లో రెండు రోజులు బెనిఫిట్ షోల కోసం డిస్ట్రిబ్యూటర్ నియంత్రణలోనే థియేటర్ ఉంది. ముందు జాగ్రత్తల్లో భాగంగా థియేటర్ వద్ద రద్దీ ఉంటుందని చిక్కడపల్లి ఎస్‌హెచ్‌వోకు, ట్రాఫిక్ పోలీసులకు థియేటర్ మేనేజ్మెంట్ సమాచారం ఇచ్చింది.

అయితే, తగినంత సిబ్బంది లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. భాస్కర్ ఫిర్యాదులో నిర్ధిష్ట అభియోగాలు లేవు. పోలీసులు నమోదు చేసిన కేసులోని అభియోగాలు తమకు వర్తించవు. ఫిర్యాదుదారుడు అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిపైనే ఆరోపణలు చేశారు. థియేటర్ ఆవరణల్లో ఘటన జరిగిందని చెప్పి తమపై కేసు నమోదు చేయడం అన్యాయం. దీనికితోడు మృతురాలిపై, గాయపడిన వాళ్లపై ఏవిధమైన ఆయుధ దాడి గాయాలు లేవు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కొట్టివేస్తూ పోలీసులకు ఆదేశాలివ్వాలి. పిటిష్ప విచారణ పూర్తి అయ్యే వరకు తమను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. థియేటర్ స్టాఫ్‌ను పోలీసులు విచారణ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలి. కేసు దర్యాప్తును నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వాలి’ అని పిటిషన్లో పేర్కొన్నారు.