calender_icon.png 24 October, 2024 | 9:55 PM

న్యాయ నిపుణులతో చర్చించండి

04-08-2024 01:53:55 AM

అధికారులకు 317 జీవో క్యాబినెట్ సబ్‌కమిటీ ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): 317 జీవో సమస్యలపై న్యాయ నిపుణులతో చర్చించాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులకు ఆదేశించింది. 317 జీవో సమస్యల పరిష్కారంపై శనివారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యుడు మంత్రి శ్రీధర్ బాబు సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్థానికతకు సంబంధించి పలు ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ అధికారులు క్యాబినెట్ సబ్ కమిటీ ముందుం చారు. దీంతో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో సంప్రదించి తుది నివేదికను కమిటీకి సమర్పించాలని అధికారుకులకు ఆదేశించింది. అదేవిధంగా జీవో నంబర్ 46కు సంబంధించిన అంశాలపై సైతం న్యాయ నిపుణులతో చర్చించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, శివశంకర్, బుసాని వెంకటేశ్వరరావు, జీ సునీతాదేవి, మల్లికార్జున్ పాల్గొన్నారు.