calender_icon.png 20 September, 2024 | 12:34 PM

ముగ్గురు గురుకుల విద్యార్థుల అదృశ్యం

19-09-2024 01:25:39 AM

దేవరకొండ మైనార్టీ పాఠశాలలో ఘటన

నల్లగొండ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా దేవరకొండ పట్ట ణం కొండభీమనపల్లి పరిధిలోని మైనార్టీ గు రుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. సూర్యాపేట జిల్లా పాలకీ డు మండలం జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన ఎస్‌కే తౌఫిక్ ఉమర్, నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చె ందిన అబ్దుల్ రెహమాన్, అనుము ల మండలం హజారిగూడేనికి చెం దిన ముజీబ్ దేవరకొండ మైనార్టీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఆ ముగ్గురు కనిపించడంలేదు.

ఈ నెల 16న సాయంత్రం ఆ ముగ్గురు పాఠశాల సమీ పం నుంచి ప్యాకెట్లలో కల్లు తీసుకువచ్చారు. గుర్తించిన హాస్టల్ సిబ్బంది వారిని తీవ్రంగా మందలినట్లు సమాచారం. విషయం ఉపాధ్యాయులకు తె లుస్తుందని భయపడి విద్యార్థులు ప రారైనట్లుగా తెలుస్తున్నది. అదనపు కలెక్టర్ పూర్ణచందర్‌రావు బుధవారం పాఠశాలకు వెళ్లి ఘటన గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆచూకీ లభించకపో వడంతో కుటుంబీకులు దేవరకొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.