calender_icon.png 25 September, 2024 | 10:01 AM

బ్యాంక్ మేనేజర్ అదృశ్యం

25-09-2024 02:38:22 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 24: ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన ఓ బ్యాంక్ మేనేజర్ అదృశ్యమైన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యం గా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. వేదంగి పవన్‌కుమార్ (42) భార్యతో కలిసి కొత్తపేటలోని పద్మజ రెసిడెన్సిలో ఉంటూ గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

ఈనెల 21న ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిన పవన్‌కుమార్ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసినవారి వద్ద ఎంత వెతికినా అతడి ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో అల్మాస్‌గూడలో ఉం టున్న అతడి తండ్రి వేదంగి రామచంద్రరావు తన కొడుకు పవన్‌కుమార్ కనిపించడం లేదని మంగళవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.