calender_icon.png 1 March, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు ఏరియాలో పర్యటించిన డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)...

01-03-2025 05:52:45 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు శనివారం ఇల్లందు ఏరియా లోని జెకె-5, కోయగూడెం ఓసి, సి.హెచ్.పి.లలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుచున్న పనులను పరిశీలించారు. రోజు వారి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.యం వీసం కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. తరువాత డైరెక్టర్ (పి.పి) కే. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని, అలాగే ఉపరితల గనుల్లో ఎండా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అంతేకాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని, సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమి౦చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జియం ఎన్విరాన్మెంట్ సైదులు, జియం (ఎస్టేట్) రాధాకృష్ణ, ఎస్ ఓ టు జీఎం రామస్వామి, కే.ఓ.సి.పి.ఓ గోవింద రావు, జే.కే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎ.కృష్ణ మోహన్ రావు, మేనేజర్ పూర్ణచందర్, సౌరభ్ సుమన్, క్యాలిటీ మేనేజర్ కె. రామదాస్, సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.