21-03-2025 12:00:00 AM
టాలీవుడ్లో నిర్మాతగా దిల్ రాజుకు ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ, కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి దిల్ రాజు బ్యానర్ నుం చి ఓ క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి హర్షిత్రెడ్డి, హన్షితరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గురు ఫిల్మ్స్కు చెందిన సునీత తాటి కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమవుతుండగా.. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మల్టీస్టారర్గా తెరకెక్కిస్తున్నారు.
శిరీష్ సమర్పకుడిగా వ్యవహరిస్తు న్న ఈ ప్రాజెక్ట్కు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇటీవల మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న ‘మార్కో’ సినిమా దర్శకుడు హనీఫ్ అదేని పేరు ఇప్పుడు బాగానే ట్రెండ్ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్తో సినిమాను చేయబోతున్న విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘మార్కో’తో మాస్, వయలెన్స్, యాక్షన్ యాంగిల్ను చూపించిన హనీఫ్.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రకటనతో తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.