calender_icon.png 23 October, 2024 | 3:16 AM

సందేశాత్మకంగా సారంగదరియా

11-07-2024 12:05:00 AM

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం ‘సారంగదరియా’. జూలై 12న విడుదల కానున్న ఈ సినిమాతో పద్మారావు అబ్బిశెట్టి (పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విడుదల సమీపిస్తున్న తరుణంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రాజా రవీంద్ర గారు నాకు ఫ్యామిలీ వంటి వారు. తన అనుభవం తో మాలాంటి కొత్త నటులకు సూచనిలస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఆయన కొత్త కోణంలో కనపడిన ఈ సినిమాపై అంతా సానుకుల స్పందన వస్తోంది” అని అన్నా రు. నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ “మా దర్శకుడు ట్రైలర్‌లోనే కథ మొత్తం చెప్పేశాడు.

ఈ చిత్రంలో నాకు ముగ్గురు కొడుకులుంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య ఉంటుంది. కాలేజ్ లెక్చరర్‌గా పని చేసి అందరికీ నీతులు చెబుతాను. కానీ నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతాను. సోషల్ మీడియా, ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్ సరిగ్గా ఉండటం లేదు. కలిసి కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి టైంలో పిల్లలు చెడు బాట పట్టొచ్చు. పిల్లల కు తల్లిదండ్రులు మోరల్ సపోర్ట్ ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు అనే అంశంతో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది” అని తెలిపిన ఆయన “తెలంగాణ ప్రభు త్వం డ్రగ్స్ మీద పోరాటం చేస్తోంది. అందరూ డ్రగ్స్‌కి దూరంగా ఉండండి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు, సంగీత దర్శకుడు ఎబెనెజర్ పాల్, పాటల రచయితలైన కడలి, గోశాల రాంబాబు, నటులు మోయిన్, మోహిత్, యశస్విని తదితరులు పాల్గొన్నారు.