calender_icon.png 20 September, 2024 | 1:04 PM

అందాల రాణికి 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్' కిరీటం

20-09-2024 10:39:33 AM

వాషింగ్టన్: అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి ధ్రువీ పటేల్ మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2024 విజేతగా ఎంపికయ్యారు. న్యూజెర్సీలో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు నిర్వహించారు. ఈ ధ్రువీ పటేల్ మాట్లాడుతూ... మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో ఆమె విజేతగా కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటి, యూనిసెఫ్ అంబాసిడర్ అవ్వాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో సురినామ్ కు చెందిన లిసా అబ్దోయెల్ హాక్ ఫస్ట్ రన్నరప్ గా, నెదర్లాండ్స్ కు చెందిన మాళవిక శర్మ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. టీన్ కేటగిరీలో గ్వాడెలోప్ కు చెందిన సియెర్రా సురెట్ మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటీన్ని దక్కించుకున్నారు. ఈ అందాల పోటీలను న్యూయార్క్ కు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ నిర్వహిస్తోంది.