calender_icon.png 21 October, 2024 | 2:38 PM

రైతు భరోసా.. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

21-10-2024 12:58:11 PM

వెల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రైతు భరోసా గురించి సోమవారం నాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న నర్సాపూర్ శాసనసభ్యులు వాకిటి సునీత లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు రుణమాఫీ అందించలేదని విమర్శించారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.