calender_icon.png 19 October, 2024 | 6:44 PM

హైకోర్టు తీర్పును అమలు చేయాలని ధర్నా..

19-10-2024 04:23:27 PM

కొత్తగూడెం: హైకోర్టు తీర్పు అమలు చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఓసి 2 భూ నిర్వాసితులకు భూమికి బదులు భూమి, నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వాసితులు సింగరేణి కోయగూడెం ఓసి లో భారీ ర్యాలీ నిర్వహించారు. కేవోసీ ప్రాజెక్టు అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.