calender_icon.png 30 September, 2024 | 4:45 AM

ట్రిపుల్ ఐటీ కార్మికుల ధర్నా

29-09-2024 12:19:04 AM

నిర్మల్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శనివారం సీఐటీయూ, బాసర కార్మిక, ఔట్ సోర్సింగ్ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కనీస వేతనం రూ.18,000 చెల్లించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పని భారం తగ్గించాలని, అధికారులు వేధింపలు ఆపాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పిరాజీ, గంగన్న, లింగన్న, సిద్ధు, ఆకాశ్, రవి, సాయి పాల్గొన్నారు.