calender_icon.png 19 October, 2024 | 6:26 PM

జాతీయ రహదారిపై జర్నలిస్టుల ధర్నా

19-10-2024 05:17:32 PM

కరీంనగర్, (విజయక్రాంతి): ఇల్లెందుల మండలంలో జర్నలిస్ట్ సుదర్శన్ రెడ్డిపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కోరుట్ల కొత్త బస్టాండ్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ముక్కెర చంద్రశేఖర్, ఆకుల మల్లికార్జున్ లు మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు శికరి రామకృష్ణ, గంగుల రాంగోపాల్, గోడికే రాజు, శ్రీనివాస్, నవీన్, అంజు, విజయ్ పాటిల్, బలిజ సంతోష్, శిఖరి గోపి, చిరంజీవి, సాయి,నటరాజ్, ప్రేమ్, రమణ, నారాయణ, సుమన్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.