calender_icon.png 30 September, 2024 | 5:44 PM

కుట్టు మిషన్లు కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా

30-09-2024 03:36:01 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఇల్లందు అశ్వరావుపేట భద్రాచలం నియోజకవర్గం నిరుపేదలైన ముస్లిం మహిళలకు తక్షణమే కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సేవ్ కొత్తగూడెం -సేవ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ మాట్లాడుతూ నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి 8 నెలలైనా  అధికారులు ఎందుకు  పంపిణీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేయటంలో ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితాలో పేర్లు మార్పులు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారని తక్షణమే దాన్ని విరమించుకోవాలని ఆయన అన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ జితేష్ వి పార్టీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమూద్, రిజ్వానా, జిలాని, వేణు మహేష్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు