calender_icon.png 24 October, 2024 | 5:54 AM

26న జంతర్ మంతర్ వద్ద ధర్నా

24-10-2024 01:03:15 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 

ముషీరాబాద్, అక్టోబర్ 23: పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి, కులగణన చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కాచిగూడలోని ఓ హోటల్‌లో ఈ నెల 26న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.

చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్ట నున్నట్లు తెలిపారు. ధర్నాకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది బీసీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, బీసీ సంక్షేమ సంఘం నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.