రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు
సూర్యాపేట, జూలై 23(విజయక్రాంతి): ధరణి లోపాలను అడ్డుపెట్టుకుని గత పాలకులు, కొందరు అధికారులు ఎన్నో పొరపా ట్లు చేశారని మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట కాంగ్రెస్ జిల్లా కార్యాల యంలో మీడియాతో మాట్లాడారు. నడిగూడెం మండంలోని రామాపు రానికి చెందిన ముత్తయ్యకు వారసత్వంగా వస్తున్న భూమిని ఇతరులు కబ్జా చేయడం బాధకరమని అన్నారు. బాధితుల నుంచి సమా చారం తెలుసుకునేందుకు తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. అసలు పట్టాదారులను కాదని వేరొకరికి పట్టాలు చేశారని మండిపడ్డారు. పట్వారీ వ్యవస్థ ఉన్న సమయంలోనూ ఇలాంటి సమస్యలు లేవని అన్నారు. రాష్ట్రంలో సమస్య ఎక్కడ ఉన్న తాను అక్కడికి వెళతానని, ఆ సమస్యను పరిష్కరిం చేంతవరకు బాధితుల పక్షాన ఉంటానని స్పష్టంచేశారు.