1994 బ్యాచ్ అధికారులకు ప్రమోషన్
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో 1994 బ్యాచ్కు చెందిన ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభు త్వం ప్రమోషన్ కల్పించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఐదుగురు అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) హోదాతో ప్రమోట్ చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. హైదరాబాద్ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్రెడ్డిని అదే స్థానంలో కొన సాగించిన ప్రభుత్వం.. డీజీపీ క్యాడర్లో ఉద్యోగోన్నతిని కల్పించింది. బీ శివ్ధర్రెడ్డి (తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్), అభిలాష బిస్త్ (తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్), సౌమ్య మిశ్ర (జైళ్ల శాఖ డీజీ), శిఖా గోయెల్ (సీఐడీ చీఫ్)ను వారివారి స్థానాల్లోనే కొనసాగిస్తూ డీజీపీ హోదాలో ప్రమోషన్ ఇచ్చి నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే అభిలాష బిస్త్ ప్రమోషన్ను కేంద్ర ప్రభుత్వ ఆధీనం లో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీఅండ్పీ) నిర్ధారించాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది.