11-11-2024 01:13:28 AM
చేర్యాల, నవంబర్ 10 : ఆదివారానికి కార్తీక మాసం కలవడంతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దర్శనానికి సుమారు రెండు గంటలకుపైగా సమయం పట్టింది. మల్లన్నకు పట్నం వేసి, బోనం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.