calender_icon.png 3 October, 2024 | 4:49 PM

108 చీరలతో కుమారి అలంకారంలో దర్శనమిచ్చిన గజ్వేల్ మహంకాళి

03-10-2024 12:21:05 PM

ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

గజ్వేల్ (విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలోని మహంకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారి మూల మూర్తికి పంచామృత అభిషేకం, పుణ్యాహవఛనం, చతుషష్టి ఉపచార పూజ, గో పూజ కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు గజ్వేల్ మహంకాళి 108 చీరల తో  కుమారి అలంకారంలో దర్శనమిచ్చింది. ఆలయ ప్రధాన అర్చకులు  నంద బాల శర్మ వైదిక నిర్వాహణలో పూజా కార్యక్రమాలు జరుగుతుండగా, ఆలయ కమిటీ అధ్యక్షుడు కాల్వ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు