calender_icon.png 16 October, 2024 | 4:04 PM

అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

16-10-2024 11:49:26 AM

రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

60వ డివిజన్, రామన్నపేట ఎస్సీ కాలనీలో సి.సి. కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం, (విజయక్రాంతి): అభివృద్ధి పనులను నాణ్యతతో, అగ్రిమెంట్ సమయంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ రామన్నపేట ఎస్సీ కాలనీలో ఎస్.డి.ఆర్.ఎఫ్. నిధులు రూ. 25 లక్షలతో చేపట్టిన సి.సి. కాలువ నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డుకు ఇరువైపులా వేస్తున్న రెండు లైన్ల కాలువ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మనం చేపట్టే పనులు నాణ్యతతో ఉండాలని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉండవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, 60వ డివిజన్ కార్పొరేటర్ బద్దె నిరంజన్ కుమార్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.