calender_icon.png 27 October, 2024 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరస్పర సహకారంతోనే అభివృద్ధి

27-10-2024 02:16:55 AM

ఏపీ తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి, వాసంశెట్టి సుభాష్

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): రెండు రాష్ట్రాలు పరస్పరం సహరించుకుంటూ ముందుకెళ్తే ఇరు రాష్ట్రాల్లోనూ అభి వృద్ధికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలంగాణ, ఏపీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శనివారం ఏపీ మంత్రి వాసంశెట్టి.. మంత్రుల నివాస సముదాయంలోని కోమటిరెడ్డి నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఏపీతో అనుసంధానించే ఎన్‌హెచ్ విషయంలో తెలంగాణ చూపిన చొరవ వల్ల రెండు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగుపడతాయని వాసంశెట్టి తెలిపారు. తెలంగాణలో ప్రభు త్వం చేపట్టిన ఆర్‌ఆర్‌ఆర్, మూసీ శుద్ధీకరణ గురించి కోమటిరెడ్డి ఏపీ మంత్రికి తెలిపారు. భవిష్యత్తులోనూ సమన్వయంతో ముందు కు సాగాలని ఇరువురు ఆకాంక్షించారు.