20-03-2025 04:57:24 PM
అనంతగిరి: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పాలనతోనే సాధ్యమని మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పార్టీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డిల పటాలకు క్షీరాభిషేకం అనంతరం మాట్లాడుతూ... ఉత్తంకుమార్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించి బీసీ, ఎస్సీ వర్గీకరణ ల రిజర్వేషన్ల బిల్లును రెండు సభలలో ఆమోదింపచేయడం చారిత్రాత్మక విజయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.