అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించాలి
సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను వారంలోగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. వర్షాలు, వరదలపై జరిగిన నష్టంపై అంచనా వేయడంపై సీఎస్ శాంతికుమారి మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రవిగుప్తా, వికాస్రా జ్, అర్వింద్కుమార్ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లా డుతూ ఇప్పటికీ అనేక జిల్లాలలో వరదలు, వానలు తగ్గుముఖం పట్టలేదన్నారు.
జరిగిన నష్టాన్ని వెంటనే అంచ నా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని సూచించారు. సీఎం రేవవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్లను ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులు, సిబ్బంది, పరికరా ల వివరాలను వెంటనే సమర్పించాలన్నారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలన్నారు. సమవేశంలో ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, నవీన్ మిట్టల్, రాహుల్ బొజ్జా, రఘునందన్రావు, లోకేశ్ కుమార్, రోనాల్డ్రోస్, ప్రశాంత్ జీవన్ పాటిల్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, జలమండలి ఎండీ అశోక్రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారాఫ్ అలీ, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.