శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 : ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడాకారులు ఆటలు ఆడేందుకు వేదిక దొరకడమే గగనం. అలాంటిది ఉన్న స్టేడియాన్ని మేనేజ్మెంట్ ఓ సంగీత దర్శకుడి ఈవెంట్ కోసం ధ్వంసం చేస్తున్నది. ఈనెల 19న గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్కు యాజమాన్యం అనమతులు ఇవ్వడంతో పాటు వేదిక ఏర్పాటు కోసం స్టేడియంలోనిరన్నింగ్ ట్రాక్ను ధ్వంసం చేసింది.
సీఎం రేవంత్రెడ్డి గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేశారు. ఆ పనులను పూర్తి చేయాల్సిన మేనేజ్మెంట్ మాత్రం ఓ సంగీత దర్శకుడి ఈవెంట్కు ప్రాధాన్యం ఇవ్వడం, స్టేడియాన్ని ధ్వంసం చేయడంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి.