calender_icon.png 14 October, 2024 | 9:51 AM

డైనింగ్ హాల్ ధ్వంసం

14-10-2024 03:21:07 AM

కామారెడ్డి,అక్టొబర్13(విజయక్రాంతి): డోర్ పగలకొట్టి  నిర్మించిన డైనింగ్ హాల్ పీఓపీ షీట్లను ధ్వంసం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పరిత్ ఉన్నత పాఠ శాలలో చోటు చేసుకుంది. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన స్వగ్రామం కావడంతో  అప్పట్లో జిల్లా లో ఎక్కడా లేని విధంగా రూ. 2 కోట్ల తో ఆధునాతన హంగులతో పాఠశాలను డెవలప్ చేశారు. ఎలాంటి పొర పాట్లు జరగకుండా భవన నిర్మాణ పనులు, గదుల నిర్మాణం, డైనింగ్ హాల్, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టా రు.

దసరా పండుగ కావడంతో స్కూల్‌కు సెలవులు ఇచ్చారు. అయితే నిన్న మొన్నటి వరకు పాఠశాలలో క్రీడాపోటీలు కూడా నిర్వహించారు. రూ.17 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్ కిటికీలను తొలగించి కింద పడే శారు. హాల్లో ఉన్న ఫ్యాన్లను తొలగించారు. అయితే ఇది ఆకతాయిల పనే అయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.