హైదరాబాద్, అక్టోబర్ 19(విజయక్రాంతి): ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకుడిగా డిప్యూటీ సీఎం భట్టి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శనివారం ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో సీనియర్ నేతలు అధీర్ రంజన్ చౌదరి, తారీఖ్ అన్వర్తో కలిసి స్థానిక నాయకులతో భట్టి సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు.
ఇదిలా ఉండగా.. రాంచీకి వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి భట్టి స్వాగతం పలికారు. ఆ తర్వాత రాహుల్తో కలిసి రాష్ట్రంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సీట్ల పంపకంపై మిత్ర పక్షాలతో చర్చించారు.